కరీమబాద్ : మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 25న ఓ వ్యక్తి రోడ్డుపై పడి ఉండగా పోలీసులు అతడిని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. ఈ మెరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వ్యక్తి తెలిసిన వారు మామునూరు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. గుర్తు పట్టిన వారు 9491089138, 9440795228, 7382294054లకు సమాచారం అందించాలని కోరారు.
గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య
కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య సుమారు 30 సంవత్సరాలు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్సై పరుశురాములు తెలిపారు. తల, మొండెం, కాళ్లు, వేర్వేరుగా పడి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని గుర్తు పట్టలేని విధంగా మొఖం చితికి పోయింది. మృతుడి ఎడుమ చేయిపై ఈ. రేవంత్ అని ఇంగ్లీష్లో పచ్చబొట్టు ఉంది. రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని ఎంజీఎం మార్చూరికి తరలించి దర్యాప్తు చేపట్టారు. తెలిసిన వారు వరంగల్ రైల్వే పోలీసు స్టేషన్లో గాని లేదా ఎంజీఎం మార్చూరిలోగాని సంప్రదించాలని ఎస్సై తెలిపారు.