సైదాబాద్ : ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న (45) గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మరణించిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ వెంకట్రెడ్డి కథనం ప్రకారం…
సైదాబాద్ వినయ్నగర్ కాలనీ చౌరస్తా సమీపంలోని ప్రశాంత్నగర్ కాలనీ పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి పుట్పాత్పై అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడని, స్థానికులు, జీహెచ్ఎంసీ అధికారులు గురువారం సాయంత్రం సైదాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో జీహెచ్ఎంసీ యూడీసీ విభాగం అధికారులు, స్థానికుల సహాయంతో ఆతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు 108 అంబులెన్స్ వాహనంలో తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ఆతను సుమారు 10 గంటల సమయంలో మరణించాడని వైద్యులు ప్రకటించారు.
మృతుడు కొన్ని సంవత్సరాలు స్థానికంగా ఓ ఆపార్టుమెంట్ వద్ద పనిచేసేవాడని, కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు అమానిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సైదాబాద్ పోలీసులను సంప్రదించాలని, సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఏఎస్ఐ వెంకట్ రెడ్డి దర్యాప్తు జరుపుతున్నారు.