పర్ణశాల: మండల పరిధిలోని పర్ణశాల గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పర్ణశాల గ్రామంలో యాత్రికులు బసచేసే మర్రి చెట్టు వద్ద ఓ గుర్తుతెలియని యాచకుడు మృతిచెంది ఉండటంతో స్థానికులు దుమ్ముగూడెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తి వివరాలు, మృతికి గల కారణాలను ఆరా తీశారు. ఆ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.