కాచిగూడ : గుర్తుతెలియని వ్యక్తి కర్నూల్ స్పెషల్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి(40) సోమవారం మలక్పేట రైల్వేస్టేషన్ సమీపంలో కర్నూల్ స్పెషల్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శరీర భాగాలు చెల్లచెదురైనాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని స్వాధీనపర్చుకుని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.మృతుని ఒంటిపై తెలుపు రంగు ఫుల్ షర్ట్, సిమెంట్ రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతుని వివరాలు తెలిసిన వారు 8143807592లో సంప్రదించాలని కోరారు.