మంచిర్యాల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కొడుకు చావుకు కోడలే కారణమనే అనుమానంతో కోడలిని మామ దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ అమానవీయ సంఘటన కోటపల్లి మండలం లింగన్నపేటలో చోటు చేసుకుది.
స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రాళ్లబండి సాయి-బోరాగళ్ల సౌందర్య(19) ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా, సాయి మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.
తన కొడుకు ఆత్మహత్యకు సౌందర్యే కారణం అని సాయి తండ్రి రాళ్లబండి తిరుపతి అమ్మాయిపై పగ పెంచుకున్నాడు. అదను చూసి సోమవారం కోడలు సౌందర్యను గొడ్డలితో నరికి చంపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.