అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మామిడితోటలో సేద తీరుతున్న వారిపై పిడుగుపడి ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పద్మనాభం మండలం చాకలిపేట గ్రామంలో ఇవాళ సాయంత్రం ఈ ఘటన జరిగింది. వీరంతా ఓ వివాహ వేడుకకు హాజరై వస్తూ మామిడి తోటలో సేద తీరుతుండగా ఈదురుగాలలతో కురిసిన వర్షంలో పిడుగు పడింది. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని దవాఖానకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.