ఖానాపూర్ రూరల్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామం సేవ్యనాయక్ తండా పరిధిలో సోమవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాల య్యాయి. సీఐ అజయ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ పట్టణానికి చెందిన మునగంటి కృష్ణ (ఓ దిన పత్రిక ఎస్ఆర్), తర్లపాడు గ్రామానికి చెందిన ఆకుల రాజ్కుమార్తో కలిసి పెంబి గ్రామానికి వెళ్తున్నారు. అదే దిశలో పెంబి మండలం నాగపూర్ గ్రామం నుంచి మగెని సాయిలు, దండ్ల రాజేందర్, మక్కల సాయన్న ముగ్గురు ద్విచక్రవాహనంపై ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నారని వివరించారు.
రోడ్డు ప్రమాదంలో మునగంటి కృష్ణ (28) అక్కడిక్కడే మృతి చెందగా మిగత నల్గురిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించగా మార్గ మధ్యలో నాగపూర్కు చెందిన మగెని చిన్న సాయిలు (33) మృతిచెందాడని సీఐ వెల్లడించారు. ప్రమాద ఘటన స్థలంలో ఎయిర్గన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎయిర్గన్ స్వాధీనంపై విచారణ జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మృతి చెందిన మునగంటి కృష్ణకు తల్లి, మగెని చిన్న సాయిలుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నట్లు తెలిపారు.