ఆదిలాబాద్ : ఈత సరదా ఇద్దరు స్నేహితుల ప్రాణాలు తీసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు రూరల్ మండలంలోని లాండసాంగి వాగులోకి ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఆదిలాబాద్ పట్టణం బొక్కలగూడ కాలనీకి చెందిన షేక్ అత్మస్ఖాన్ (26), మరో కాలనీకి చెందిన సయ్యద్ షాహిద్ (28) అనే ఇద్దరు మిత్రులు వాగులోకి దిగగా.. ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా.. మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.