దుండిగల్,ఆగస్టు : బైక్పై మితిమీరిన వేగం ఒకరి ప్రాణం తీసింది.ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దుండిగల్ గ్రామానికి చెందిన తలారి మల్లేశ్(25) అనే వ్యక్తి గురువారం సాయంత్రం ఐడీఏ బొల్లారంలో జరిగిన బంధువుల దశ దినఖర్మకు హాజరయ్యాడు. అనంతరం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగుప్రయాణమయ్యాడు.
అయితే రాత్రి పూట కావడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో శంభీపూర్ సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో మల్లేష్ తలకు బలమైన గాయాలు కావడంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పిట్టగోడ పై నుండి పడి వలసకూలీ…
ఫిట్స్తో బాధపడుతున్న ఓ వలసకూలీ పిట్టగోడపై నుంచి పడి మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన కమలేష్కుమార్(24) గతనాలుగు ఏండ్లుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేటలోని ఓ నిర్మాణసంస్థలో సెంట్రింగ్కూలీగా పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నాడు.
ఈ క్రమంలో గురువారం సాయంత్రం తన స్నేహితుల వద్దకు వెళ్లిన కమలేష్ వారితో సరదాగా మాట్లాడుతూ ఓ భవనంపైనున్న పిట్టగోడపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. దురదృష్ట వశాత్తు కాలుజారడంతో భవనంపై ఉన్న స్లాబ్పై పడిపోయాడు. దీంతో తలకు బలమైన దెబ్బలు తగలడంతో కమలేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి కూలీల ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.