మార్గమధ్యంలో బైక్ గుర్తింపు
రామగిరి/మంథని రూరల్, ఏప్రిల్ 18: భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.50 లక్షలతో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో శనివారం కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా లద్నాపూర్కు చెందిన చిప్ప రాజేశం రేషన్ డీలర్గా, ముత్తారం విలేకరిగా పనిచేస్తున్నాడు. ఉడుత మల్లయ్య వ్యవసాయం చేస్తుంటాడు. వీరిద్దరూ కలిసి భూపాలపల్లి జిల్లా గంగారంలో కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు శనివారం రూ.50 లక్షలు తీసుకొని బైక్పై కాటారానికి బయలుదేరారు. రాత్రయినా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆందోళనకు గురైన కుటుంబీకులు వారికోసం గాలిస్తుండగా మంథని మండలం బట్టుపల్లి సమీపంలో రోడ్డు పక్కన బైక్ను గుర్తించారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. రాజేశం భార్య పుష్పలత ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.