ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన తాడ్వాయి మండలం వెంగల పూర్ చింతల్ క్రాస్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడారం అమ్మవార్లను దర్శించుకుని ములుగు వైపు కారులో తిరిగి వెళుతున్న క్రమంలో కారు అదుపుతప్పిన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.