సౌతాంప్టన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ కోసం టీమ్ఇండియా మంగళవారం జట్టును ప్రకటించింది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న పోరు కోసం భారత్ అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. సౌతాంప్టన్లోని ఏజెస్ బౌల్ పిచ్.. పేస్, బౌన్స్కు సహకరిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఐదుగురు పేసర్లకు జట్టులో స్థానం కల్పించింది. బుమ్రా, షమీ, ఇషాంత్, సిరాజ్తో పాటు ఉమేశ్ను ఎంపిక చేసింది. పేస్ ఆల్రౌండర్ లోటును భర్తి చేసేందుకు శార్దూల్ను తీసుకుంటారని భావించినా.. అనుభవానికే పెద్దపీట వేస్తూ ఉమేశ్ వైపు మొగ్గుచూపింది. ఇటీవలి కాలంలో సత్తా చాటుకున్న శార్దూల్, అక్షర్, సుందర్, మయాంక్ వంటివారితో పాటు రాహుల్కు ఈ జట్టులో చోటు దక్కలేదు.
భారత జట్టు: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, గిల్, పుజారా, రహానే, విహారి, పంత్, సాహా, అశ్విన్, జడేజా, బుమ్రా, షమీ, ఇషాంత్, సిరాజ్, ఉమేశ్.