బేగంపేట్ : హెరాన్ గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 90 గ్రాముల హెరాయిన్, 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వెస్ట్ బెంగాల్ కు చెందిన లాల్చల్ మోమిన్ 23 అతనికి కజిన్ సోదరుడు జైసీముద్దీన్ మోమిన్ 29లు ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చారు. ఇందులో ఒకరు తాపి మేస్త్రీ, మరోకరు కార్మికుడిగా పని చేస్తూ శేరిలింగంపల్లి నానక్రాంగూడలో రాక్ హాస్టల్లో ఉంటున్నారు.
వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో సులువుగా నగదు సంపాదించేందుకు హెరాయిన్, గంజాయి సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వెస్ట్ బెంగాల్ నుంచి వాటిని తీసుకువచ్చి నగరంలో అవసరమున్న వారికి విక్రయిస్తున్నారు.
శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో రాంగోపాల్పేట్ అంబేద్కర్నగర్ జంక్షన్లో జైసీముద్దీన్ మోమిన్ తన వద్ద ఉన్న గంజాయిని విక్రయించేందుకు వేచి చూస్తుండగ రాంగోపాల్పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వద్ద నుంచి 30 గ్రాముల హెరాయిన్,70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి ఇద్దరిని అదుపులోకి రిమాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.