Road Accident | బిహార్లోని వైశాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాతాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహురా కూడలి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. వేగంగా వచ్చిన లారీ.. రోడ్డునే ఉన్న ఓ తినుబండారాల దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సీఎం నితీశ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బహురా కూడలి సమీపంలో వేగంగా వచ్చిన ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న తినుబండారాల దుకాణాన్ని ఢీకొట్టిందని పటేపూర్ ఎస్హెచ్ఓ రామశంకర్ కుమార్ తెలిపారు. సంఘటనా స్థలంలో నలుగురు మృతి చెందారని, ఎనిమిది గాయపడ్డారన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.