భోపాల్ : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్రూట్లో అతివేగంగా వచ్చిన ట్రక్కు.. బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.
రైసెన్ జిల్లా సిల్వాని పట్టణ సమీపంలోని ఛతాపూర్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. 21 ఏండ్లున్న ఇద్దరు యువకులు, 30 ఏండ్ల వయసున్న మరో యువకుడు బైక్పై దేహ్గావ్ వైపు వెళ్తుండగా రాంగ్రూట్లో వచ్చిన ట్రక్కు ఎదురుగా ఢీకొట్టింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారని బంహోరీ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి మయా సింగ్ తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కును వదిలి డ్రైవర్ పరారయ్యాడు. మృతుల్లో ఇద్దరు రైసెన్ జిల్లా కేంద్రానికి చెందిన వారు.. మరొకరు నర్సింగ్పూర్ జిల్లాలోని గదర్వారా చెందిన వారని ఆమె పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి