నందిగామ : రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ మండల కేంద్రంలో నూజీవిడు పరిశ్రమ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన ఇప్పలపల్లి నరేశ్(30) పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఆదివారం పట్టలపై నుంచి వేళుతుండగా రైళు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.