జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గట్టు పద్మ, పసరగొండ మంజుల పొలం పనులకు కలవడానికి వెళ్లగా.. సోమవారం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గురై మృతి చెందారు. ఇద్దరి మృతి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.