నిజామాబాద్ : జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ(SRSP) పోచంపాడు గోదావరి నదిలో మహాశివరాత్రి (Mahashivaratri) సందర్భంగా పుణ్య స్థానాలకు వచ్చిన భక్తుడు ఒకరు నీట మునిగి మృతి చెందారు. మాక్లూర్ మండలానికి చెందిన కుటుంబం పోచంపాడు ప్రాజెక్టు వద్ద గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వచ్చారు. వారిలో మక్కల మహేష్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయి మరణించాడు. గోదావరి నదిలో స్నానానికి దిగిన గుత్ప గ్రామానికి చెందిన అదే కుటుంబంలోని మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.