న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని జంగ్పుర జ్యూవెలరీ దుకాణంలో గతవారం జరిగిన రూ. 25 కోట్ల దోపిడీ (Delhi Heist) సంచలనం సృష్టించింది. ఈ భారీ దోపిడీకి నిందితుడు వాడింది రూ. 100 విలువైన సుత్తి, స్క్రూడ్రైవర్లు, ప్లైయర్స్తో కూడిన ఓ టూల్బాక్స్ మాత్రమే. ఢిల్లీలో అతిపెద్ద జ్యూవెలరీ దోపిడీకి స్కెచ్ వేసిన ఒకే ఒక్కడు చత్తీస్ఘఢ్కు చెందిన లోకేష్ శ్రీవాస్ కేవలం ఈ రెండు పరికరాలతోనే చోరీకి తెగబడ్డాడు.
దోపిడీకి ముందు లోకేష్ శ్రీవాస్ ఢిల్లీలో సెప్టెంబర్ 9న, సెప్టెంబర్ 17న రెండుసార్లు రెక్కీ నిర్వహించాడు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఈ టూల్స్ను అతడు కొనుగోలు చేశారు. చాందినిచౌక్లో రూ. 100కు సుత్తిని కొనుగోలు చేసి ఇక జీబీ రోడ్డులో రూ. 1300కు డిస్క్ కట్టర్ను కొనుగోలు చేశాడు. స్కూడ్రైవర్లు, ప్లైయర్లు తన ఇంటి నుంచి తీసుకువచ్చాడు. ఆదివారం రాత్రి 11 గంటలకు పక్కనున్న భవనం నుంచి భోగాల్ ప్రాంతంలోని ఉమ్రావ్ జ్యూవెలర్స్లోకి చొరబడ్డాడు.
రాత్రంతా దుకాణంలోనే గడిపిన నిందితుడు డిస్ప్లేలో ఉన్న ఆభరణాలను దొంగిలించి ఆపై స్ట్రాంగ్రూంలోకి వెళ్లాడు. సీసీటీవీ కెమెరాలను డిస్కనెక్ట్ చేసి దోపిడీకి పాల్పడ్డాడు. స్ట్రాంగ్రూం ఉన్న గ్రౌండ్ ఫ్లోర్కు చేరుకుని, స్ట్రాంగ్రూం గోడను డ్రిల్ చేసి లోపలకు వెళ్లి ఆభరణాలను కాజేశాడు. లోకేష్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం అతడు బిలాస్పూర్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. దేశ రాజధానిలో భారీ దోపిడీకి పాల్పడిన అనంతరం నిందితుడు బిలాస్పూర్ తిరిగివచ్చాడు.
Read More :