న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి క్లినిక్లో చొరబడి, అక్కడ రోగులకు సేవలు అందిస్తున్న మహిళా డాక్టర్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోగానే దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఢిల్లీలోని ఠాగూర్ గార్డెన్ ఎక్స్టెన్షన్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళా డాక్టర్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత తగాదాలే ఈ దాడికి కారణమై ఉంటుందని వారు అనుమానిస్తున్నారు.