మంచిర్యాల : సంక్రాంతి సెలవులు సరదాగా గడుపుదామని వెళ్లిన ఆ విద్యార్థులను విధి వక్రించింది. ఈత సరదా ముగ్గురి విద్యార్థుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఈ విషాదకర సంఘన కోటపల్లి మండలం అలుగామ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో ఈత కోసం వెళ్లిన ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు గల్లంతయ్యారు.నదిలోకి నలుగురు విద్యార్థులు వెళ్లగా..ఇందులో అంబాల వంశీవర్ధన్(15), అంబాల విజయేంద్ర సాయి(15), గారే రాకేష్(15) గల్లంతు అయ్యారు. విద్యార్థుల ఆచూకీ కోసం జాలరులు ప్రాణహిత నదిలో గాలిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.