హైదరాబాద్లోని జీడిమెట్లలో సినీఫక్కీలో హత్య జరిగింది? నిందితులు ముగ్గురిని హత్యచేసి, గ్యాస్ సిలిండర్ పేలినట్లు సీన్ క్రియేట్ చేశారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మృతులు, నిందితులు బీహార్కు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకెళితే, జీడిమెట్లలోని రాంరెడ్డినగర్లోని ఓ ఇంట్లో ఎనిమిది మంది బీహార్ యువకులు అద్దెకు ఉంటున్నారు. మంగళవారం ఉదయం వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ ఇంటినుంచి పెద్దగా అరుపులు, కొట్టుకున్నట్లు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. కాగా, సాయంత్రం ఆ ఇంట్లో సిలిండర్ పేలింది. మంటలు ఎగిసిపడ్డాయి. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ముగ్గురు మృతి చెందారు. ఇంట్లో శిథిలాలనుంచి మృతదేహాలను ఫైర్, పోలీసు అధికారులు బయటకు తీసుకొచ్చారు. అయితే, మిగతా యువకులు ఈ ముగ్గురుని హత్యచేసి, గ్యాస్ సిలిండర్ పేలినట్లు సీన్ రీక్రియేట్ చేశారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.