అమరావతి : కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని
ఉలిందకొండ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు
దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులంతా ధర్మవరంలోని ఒకే కుటుంబానికి
శ్రీనివాసులు, ఆదిలక్ష్మి, భాగ్యలక్ష్మిగా గుర్తించారు.
పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాలను సమీప ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు . పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.