అమరావతి : చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి జిల్లాలోని మదనపల్లె గ్రామీణం మండలం ఐదో మైలు వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురిని తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేర్పించారు. వీరు చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు.
మృతుల్లో వాల్మీకిపురం మండలం చింతపర్తివాసులు ఇస్మాయిల్ (21), సిద్దిక్ (21), మదనపల్లె గ్రామీణం కొత్తవారిపల్లికి చెందిన శ్రీనివాసులు (40) మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.