హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మాడ్గుల మండలం చంద్రయానపల్లి వద్ద సోమవారం సాయంత్రం ఆటో-టాక్టర్ ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుప్రతికి తరలించారు. మృతులను మాడ్గుల మండలానికి చెందిన సత్యనాయక్, శాంతి, అభి (7)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.