యాదాద్రి భువనగిరి : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఉదయం పోలీసులు చెక్పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో భారీగా బంగారాన్ని గుర్తించారు. ఓ ముగ్గురు వ్యక్తుల నుంచి మూడున్నర కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. దుబాయ్ నుండి గన్నవరం ఎయిర్పోర్టుకు ఈ బంగారాన్ని తరలించారు. అక్కడ్నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఈ బంగారాన్ని ముగ్గురు వ్యక్తులు తమ అండర్వేర్లలో దాచిపెట్టారు. పట్టుబడిన వారిని సుల్తానా, షరీఫ్, జావేద్లుగా పోలీసులు గుర్తించారు.