నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఐదు ఇళ్లలో సోమవారం తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి, నగదును అపహరించారు. చోరీ జరిగిన ఇళ్లను ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ రెడ్డి పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. 20 రోజుల క్రితం పద్మాజీవాడి చౌరస్తాలో దుండగులు రూ. 8 లక్షల విలువైన సొత్తును చోరీ చేసినట్లు సమాచారం. గత ఐదురోజుల క్రితం సదాశివనగర్ వైన్స్లోనూ చోరీ జరిగింది. వరుస చోరీలతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.