జోగులాంబ గద్వాల : గద్వాల పట్టణంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్లోని ఆరు దుకాణాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. కాగా, గద్వాల పోలీసులు, బిగ్ సి నిర్వాహకులు రావడంతో దుండగులు పరారైనా ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
గద్వాల పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రాజీవ్ మార్గ్లో ఓ కాంప్లెక్స్లో బిగ్ సి, సెలెక్ట్ మొబైల్ షోరూంలతో పాటు ఇన్సూరెన్స్, లక్ష్మీట్రేడర్స్, ఐడియా సిమ్ పాయింట్ రిచార్జ్ షాప్ తో పాటు మరో రెండు దుకాణాలున్నాయి.
శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగలు షాపింగ్ కాంప్లెక్స్ లోకి చొరబడ్డారు. ఐడియా సిమ్ షాప్ నుంచి రూ.15800 నగదు అపహరించారు. అదే కాంప్లెక్స్లోని బిగ్ సి షో రూమ్ అద్దాలు పగలగొట్టారు. బిగ్ సి షోరూం వాళ్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో హైదరబాద్లోని సీసీ కెమెరాల కంట్రోల్ వారు దొంగతనం జరుగుతున్నట్లు గద్వాల బిగ్ సి నిర్వాహకులకు సమాచారం అందించారు.
బిగ్ సి షోరూం నిర్వహకులు, పోలీసులు ఏకకాలంలో రావడంతో దుండగులు పారిపోయారు. లక్ష్మీ ట్రేడర్స్ లో రూ.15,800 నగదు అపహరించినట్లు తెలిపారు. ఘటన స్థలాని ప్రోబిషనరీ ఎస్ఐ శైలేంద్ర కుమార్, సిసిఎస్ పోలీసులు, క్లూస్ టీం సభ్యలు దుకాణాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. మనకూ తప్పదా.. ఎందుకీ దుస్థితి?
Crime news : ట్రాక్టర్ బోల్తా..ఇద్దరికి తీవ్ర గాయాలు
Road accident | బైక్ను ఢీ కొట్టిన బస్సు..ఇద్దరి దుర్మరణం