పోచారం, జూన్ 19: వర్షపు నీరు నిలువకుండా ముంపు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పోచారం పరిధిలోని అరుంధతి కాలనీ, హిమగిరి కాలనీ, ఎన్టిపిసి రోడ్స్,స్వర్ణగిరి కాలనీ, జోడిమెట్ల ప్రాంతాల్లోని వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించారు.
వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్ వాణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరేష్కుమార్, హైడ్రా జోనల్ ఇన్చార్జి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.