మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రీ బిడ్డను పాము కాటేయడంతో (snake bite) మూడు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు..వేరుపుల క్రాంతి, మమతలకు రెండేండ్ల క్రితం వివాహమైంది.
భార్య, భర్తలు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మూడు నెలల క్రితం కూతురు జన్మించింది. పాపకు ఊపిరి తిత్తిలో నీరు రావడంతో ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. శనివారం రాత్రి దవాఖాన నుంచి ఇంటికి వచ్చారు. అప్పటికే మంచంపై వేసి ఉన్న దుప్పటిలో పడుకోబెట్టారు.
అందులో పాము వచ్చి చేరిన విషయాన్ని పాప తల్లిదండ్రులు గుర్తించలేదు. ఇంతలో కొద్ది సేపటి తరువాత పాప గుక్క పట్టి ఏడవడం ప్రారంభించింది. పాపకు ఏం జరిగిందోనేని భయపడిన తల్లిదండ్రులు మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ డాక్టర్కు చూపిస్తున్న క్రమంలో దుప్పటిలో నుంచి పాము కింద పడింది.
కింద పడిన పామును పాప తండ్రి తొక్కడంతో అతడిని కాటు వేసింది. చికిత్స పొందుతూ పాప మృతి చెందగా..తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పాప మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు.
ఇవి కూడా చదవండి..
Cm Kcr | శాంతమ్మకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి : మంత్రి ఐకే రెడ్డి
యాదాద్రికి పోటెత్తిన భక్తులు..