మణికొండ : కూరగాయలు తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగి రాకపోవడంతో గురువారం కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలల్లోకి వెళితే….
విజయవాడ, సింగినగర్ ప్రాంతానికి చెందిన గొల్లమారి కాసురెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి నార్సింగిలోని ఎన్సీసీ లేబర్క్యాంపులో కిరాణ దుకాణం, కూరగాయలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా ఆయన పెద్ద కుమారుడు గొల్లమారి రాజేశేఖర్రెడ్డి ఈనెల 17న ఉదయం గుడిమల్కాపూర్లోని మార్కెట్కు కూరగాయలు తీసుకువచ్చేందుకని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, తెలిసినవారి, బంధువుల వద్ద ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో గురువారం తండ్రి కాసురెడ్డి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.