మన్సూరాబాద్ : మార్నింగ్ వాక్ చేస్తూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పెంట్హౌస్ పై నుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
నారాయణపేట జిల్లా, మర్కల్ మండలం, ఎట్లాస్ పురంకు చెందిన కొత్తకోట మదన్మోహన్ రెడ్డి (50) ప్రస్తుతం మన్సూరాబాద్, విశాలాంద్రకాలనీలో భార్య శ్వేతారెడ్డి, కూతురు, కుమారుడితో కలిసి నివాసముంటున్నాడు. దుబాయ్లో 2019 వరకు ఉద్యోగం చేసి వచ్చిన ఆయన ప్రస్తుతం గ్రామంలో వ్యవసాయం చేయిస్తున్నాడు.
మధుమేహంతో బాధపడుతున్నాడు. మదన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 9 గంటల సమయంలో మార్నింగ్ వాక్ చేసేందుకు పెంట్హౌస్ పైకి వెళ్లాడు. మార్నింగ్ వాక్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. పెద్దగా శబ్ధం రావడంతో భార్య శ్వేతారెడ్డి అక్కడికి వచ్చి చూడగా మదన్మోహన్రెడ్డి తలకు తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
స్థానికులు అతడిని పరిశీలించగా గాయాలతో అప్పటికే మృతిచెందాడు. భార్య శ్వేతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.