సంగారెడ్డి : అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలంటూ ఇబ్బందులు తలపెట్టడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మునిపల్లి మండల పరిధిలోని అంతారంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన కిష్టయ్య(42) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన నర్సింలు అనే వ్యక్తి వద్ద తీసుకున్న రూ.8 లక్షలకు మిత్తితో కలిపి నాలుగు లక్షల రూపాయలు అయ్యాయి.
తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు పెట్టి అవమానపర్చడంతో.. మనస్థాపనికి గురై పొలం వద్ద బుధవారం చెట్టుకు ఉరేసుకొని కిష్టయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రుక్కుమ్బాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.