Bengaluru CEO | గోవాలోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్న మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ స్టార్టప్ కంపెనీ సీఈవో (Bengaluru CEO) సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని (four year old boy) అతికిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ బాలుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. బాలుడి తండ్రి వెంకట రామన్ (Venkat Raman) బెంగళూరులో అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక రాజాజీనగర్లోని హరీశ్చంద్రఘాట్ (Harishchandra Ghat)లో అంత్యక్రియలు పూర్తి చేశారు.
#WATCH | Karnataka: The last rites of the four-year-old boy who was murdered by mother Suchana Seth in Goa were performed at Harishchandra Ghat in Bengaluru. pic.twitter.com/pcDmIsFZQ4
— ANI (@ANI) January 10, 2024
బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో నాలుగేండ్ల కుమారుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని బ్యాగ్లో కుక్కి, ట్యాక్సీలో గోవా నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు ప్రయాణించింది. ఈ దారుణ ఘటన సోమవారం చోటుచేసుకొన్నదని గోవా పోలీసులు మంగళవారం వెల్లడించారు. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి.. 39 ఏండ్ల నిందితురాలు సుచన సేథ్ను కర్ణాటకలోని చిత్రదుర్గలో సోమవారం రాత్రి అరెస్టు చేశారు. భర్త వెంకట్ రామన్తో సుచన సేథ్ కొన్నేండ్లుగా దూరంగా ఉంటుంది. వీరిద్దరు విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్నట్టు సమాచారం. భర్తతో విభేదాల కారణంగానే సుచన సేథ్ కుమారుడిని చంపి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అసలు కారణం దర్యాప్తు తర్వాత వెల్లడవుతుందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Also Read..
భర్త మీద కోపంతోనే బిడ్డను చంపేసిందా?.. బెంగళూరు స్టార్టప్ సీఈఓ కొడుకు హత్య కేసు
Bengaluru CEO : ప్లాన్ ప్రకారమే కొడుకు మర్డర్.. హోటల్ రూమ్లో దగ్గు సిరప్ బాటిళ్లు..
కుమారుడిని చంపి.. బ్యాగులో కుక్కి..మృతదేహంతో ట్యాక్సీలో గోవా నుంచి కర్ణాటకకు