పనాజీ: గోవాలోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్న మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ స్టార్టప్ కంపెనీ సీఈవో(Bengaluru CEO) సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని చంపిన విషయం తెలిసిందే. ఆ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఆమె ఉన్న సర్వీస్ అపార్ట్మెంట్లో దగ్గు మందు ఖాళీ బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. బహుశా ఆమె పిల్లోడికి భారీ డోసు ఇచ్చి ఉంటుందని భావిస్తున్నారు. చాలా ముందస్తు ప్లానింగ్తోనే ఈ మర్డర్ జరిగి ఉంటుందని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పిల్లవాడిని బట్ట లేదా మెత్తతో నొక్కి చంపి ఉంటుందని పోస్టుమార్టమ్ రిపోర్టులో తేలింంది. ఎక్కడ కూడా చేతి మరకలు లేన్నట్లు డాక్టర్లు చెప్పారు.
నిందితురాలు సుచనా సేథ్ తన కుమారుడిని చంపి అతన్ని ఓ బ్యాగ్లో కుక్కి గోవా నుంచి బెంగుళూరు పరారీ అయిన విషయం తెలిసిందే. అయితే గోవా పోలీసులు చాలా చాకచర్యంగా ఆమెను ట్యాక్సీ డ్రైవర్ సాయంతో పట్టుకున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గ్లో ఆమెను అరెస్టు చేసి గోవాకు తీసుకువచ్చారు. చిన్నపాటి దగ్గు బాటిల్ కావాలని అపార్ట్మెంట్ సిబ్బందిని సీఈవో సుచనా కోరినట్లు తెలుస్తోంది. బహుశా పెద్ద దగ్గు మందు బాటిల్ను ఆమె పట్టుకుని వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read : కుమారుడిని చంపి.. బ్యాగులో కుక్కి..మృతదేహంతో ట్యాక్సీలో గోవా నుంచి కర్ణాటకకు
తన కొడుకు మర్డర్ చేయలేదని సుచనా విచారణలో తెలిపింది. తాను నిద్ర నుంచి మేల్కోనే లోగా తన కుమారుడి మరణించి ఉన్నాడని ఆమె చెప్పింది. సుచనా చెప్పిన కథను నమ్మడంలేదని పోలీసులు వెల్లడించారు. భార్యాభర్తలు వేరుపడడం వల్లే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని అనుకుంటున్నారు.
జనవరి ఆరో తేదీన సుచనా సర్వీసు అపార్ట్మెంట్లోకి చెక్ ఇన్ అయ్యింది. అక్కడే ఆమె జనవరి 8వ తేదీ వరకు ఉన్నది. ఇండోనేషియాలో ఉన్న తండ్రి వెంకట్ రమణ ఇండియా వచ్చేశాడు. ఇవాళ సాయంత్రం పిల్లోడికి అంత్యక్రియలు బెంగుళూరులో నిర్వహించనున్నారు.