బంజారాహిల్స్ : తనకు డబ్బులు ఇవ్వకపోతే రోజూ కొడుతుంటానంటూ పదమూడేళ్ల బాలుడు తన స్నేహితుడిని బెదిరించి రూ.1లక్ష తీసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని జహీరానగర్లో నివాసం ఉంటూ మెకానిక్గా పనిచేస్తున్న మహ్మద్ నిజాముద్దీన్ కొడుకు (13) స్థానికంగా ఉన్న క్రిసెంట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 28న నిజాముద్దీన్ బీరువాలో పెట్టిన రూ.లక్ష మాయమయ్యాయి.
మరుసటిరోజు ఉదయం కొడుకును అడగ్గా తనతో పాటు చదువుకుంటున్న స్నేహితుడు (13) కు డబ్బులు ఇచ్చానని చెప్పాడు. రోజూ తనను కొడుతున్నాడని, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించడంతో డబ్బులు ఇచ్చినట్లు చెప్పడంతో షాక్కు గురయిన తండ్రి నిజాముద్దీన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు బాలుడిపై ఐపీసీ 384సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.