మెహిదీపట్నం : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…..మెహిదీపట్నం దిల్షాద్నగర్కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ సంబంధిత వ్యక్తిని గుర్తు పట్టేవారు 9490616554,9490616558 నెంబర్లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు.