హైదరాబాద్ : ఫోన్లో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించడంతో.. ఓ విద్యార్థి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మీర్పేటలోని సర్వోదయ నగర్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. చదువు మీద దృష్టి కేంద్రీకరించాలని, ఫోన్లో గేమ్స్ ఆడటం వల్ల ఏం ఉపయోగం లేదని తండ్రి పదో తరగతి చదువుతున్న తన కుమారుడిని మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి ఉరేసుకుని దారుణానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.