అమరావతి : కృష్ణా జిల్లా నందిగామలో విషాద ఘటన జరిగింది. అనాసాగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందాడు. మృతుడిని పదో తరగతి విద్యార్థి గోపీచందర్ (15)గా గుర్తించారు. ఇదిలా ఉండగా గోపీచంద్ను వాటర్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు ఎక్కించడంతోనే విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడని అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. న్యాయం చేయాలని మృతదేహంతో పాఠశాల ఎదుట బైఠాయించారు. పోలీసులు, స్థానిక నేతలు వారికి సర్ది చెప్పడంతో విషయం సద్దు మణిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.