పాట్నా : బిహార్ నవాడా జిల్లాలో తెలంగాణ పోలీసులపై నేరగాళ్లు దాడికి యత్నించారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు బిహార్కు వెళ్లారు. పక్కా సమాచారం మేరకు.. అక్కడి పోలీసుల సహాయంతో వారిని పట్టుకునేందుకు సంయుక్త బృందం భవానీ బిగా గ్రామంలోని నిందితుడు మిథిలేశ్ ప్రసాద్ ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన మిథిలేష్ ఇంటి వెలుపల వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు సైతం కాల్పులు జరిపారు.
ఆ తర్వాత నలుగురు నిందితులు పారిపోయేందుకు యత్నించగా.. వారిని పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నలుగురిని అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.22కోట్లు, మూడుకార్లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు విదేశీ మద్యం బాటిళ్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులు పలు సైబర్ నేరాలకు సంబంధించిన ముఠా సభ్యులుగా అనుమానిస్తున్నట్లు నవాడా ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సదరు నిందితులను పీటీ వారెంట్పై పోలీసులు నగరానికి తీసుకురానున్నారు.