న్యూఢిల్లీ : ఢిల్లీలోని మహిపాల్పూర్లో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. శివంపల్లికి చెందిన సుబ్రమణియన్ రాజేశ్(45) ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. మహిపాల్పూర్లోని ఓ హోటల్లో మే 19న దిగాడు. అయితే 26న ఉదయం రాజేశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడాన్ని హోటల్ సిబ్బంది గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.
హోటల్ వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డెడ్ బాడీ పక్కన మద్యం బాటిల్ ఉన్నదని పోలీసులు తెలిపారు. బాత్రూమ్ డోర్ వద్ద మృతదేహం లభించిందని పేర్కొన్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని సఫ్దర్ జంగ్ మార్చురీకి తరలించినట్లు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారు రాగానే మృతదేహాన్ని అప్పగిస్తామన్నారు.