అహ్మదాబాద్ : మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. కఠిన చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల చేతిలో మగువలు, చిన్నారులు బలవుతున్నారు. తాజాగా సభ్యసమాజం తలదించుకునేలా గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది.
నర్మద జిల్లా దెదియపద పట్టణంలో ఆరుగురు టీనేజర్లు పదకొండో తరగతి విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది. బాధిత బాలికను నిందితుడు ఎస్టీ డిపో ప్రాంతం నుంచి స్కూల్కు తీసుకువెళ్లాడు.
ఆపై స్కూల్ భవనం వెనుక మరికొందరితో కలిసి పైశాచికానికి తెగబడ్డాడు. ఈ దారుణ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.