ముంబై : సైబర్ నేరగాళ్లు రోజుకో స్కామ్తో (Cyber Fraud) చెలరేగుతూ అమాయాకుల నుంచి అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా కొరియర్ స్కామ్తో పుణేకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి రూ. 5 లక్షలు కొల్లగొట్టారు. తైవాన్కు అక్రమంగా వస్తువులు పంపారని బాధితుడి ఆధార్ వివరాలతో అతడిని స్కామర్లు బెదిరించారు.
బాధితుడి ఆధార్ వివరాలతో తైవాన్కు మొబైల్ ఫోన్లు, పాస్పోర్ట్లు వచ్చాయని గుర్తుతెలియని వ్యక్తి నుంచి సోమవారం టెకీకి ఫోన్ కాల్ వచ్చింది. న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బాధితుడిని బెదిరించాడు. బాధితుడిని మరింత బెదరగొట్టేందుకు సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన డీసీపీతో మాట్లాడాలని ఓ వ్యక్తికి కాల్ కలిపాడు.
బాధితుడితో ఫేక్ డీసీపీ వీడియో కాల్ చేసి బెదిరించాడు. తాను చిక్కుల్లో పడాల్సి వస్తుందని భయపడిన టెకీ స్కామర్లు సూచించిన రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు దాదాపు రూ. 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆపై తాను మోసపోయానని గుర్తించిన బాధిత టెకీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు రూ. 3 లక్షలు డిపాజిట్ చేసిన ఓ ఖాతాను పుణే పోలీసులు ఫ్రీజ్ చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :