తాండూరు : అక్రమంగా తరలించే రేషన్ బియ్యం దందాకు అడ్డు వస్తున్నాడనే కోపంతో కారుతో బైక్ను ఢీకొట్టి హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన గుట్టు రట్టయింది. ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్కు పంపించారు. ఈ సందర్భంగా తాండూరు రూరల్ సీఐ జలేందర్రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. తాండూరు పట్టణ సమీపంలోని రాజీవ్గృహకల్ప సమీపంలో (తాండూరు-హైదరాబాద్) రోడ్డుపై శనివారం అర్ధరాత్రి టీఎస్08ఎఫ్బి 2268 నంబర్ గల కారు, టీఎస్ 34డి 3724 గల ద్విచక్రవానం ఢీకొనడంతో బైక్పై ఉన్న జబ్బారు మృతి చెందాడు. సోహెన్, సోఫియాన్కు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని ముమ్మాటికీ హత్యేనని ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులు యాలాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మప్టీలో తిరిగి నిందితులను పట్టకున్న పోలీసులు ఆసలు నిజం కక్కించారు.
తాండూరు సమీపంలోని రాజీవ్కాలనికీ చెందిన షేక్ ఇస్మాయిల్, అబ్దుల్ మోహి కొంత కాలంగా అక్రమ రేషన్ దందా చేస్తున్నారు. ఈ విషయన్ని అబ్దుల్ సోఫియాన్ పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నాడని వారి మధ్య గొడవ జరిగింది. దీంతో కక్ష్యగట్టిన షేక్ ఇస్మాయిల్, అబ్దుల్ మోహి కలిసి సోఫియాన్ చంపాలని పథకం వేశారు. సోఫియాన్, సోహెన్, జబ్బారు కలసి బైక్పై ఇంటికి వెలుతుండగ గమనించిన షేక్ ఇస్మాయిల్, అబ్దుల్ మోహి కారుతో బైక్ను వేగంతో గట్టిగా ఢీకొట్టడంతో జబ్బారు అక్కడిక్కడే మృతి చెందగా సోఫియాన్, సోహెన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.