మధురై: తమిళనాడు రాష్ట్రంలోని మధురై పట్టణంలో దారుణం జరిగింది. కాలేజీ నుంచి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన తండ్రిపై కొందరు యువకులు అకారణంగా దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆరుల్దాస్పురానికి చెందిన పీ సెంథామిల్ పాండియన్ కుమార్తె మధురైలోని శ్రీ మీనాక్షి మహిళల గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నది.
ఎప్పటిలాగే పీ సెంథామిల్ పాండియన్ గత బుధవారం కూడా కుమార్తెను కాలేజీ నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు మధురైకి వెళ్లాడు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కాలేజీ విడిచిపెట్టగా.. అప్పుడే కాలేజీ ముందుకు ఓ అంతిమయాత్ర ర్యాలీ వచ్చింది. ఈ సందర్భంగా కొందరు యువకులు శవం ముందు డ్యాన్స్ చేస్తూ అమ్మాయిలవైపు చూస్తూ గట్టిగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
దాంతో సెంథామిల్ పాండియన్ వాళ్లను మందలించాడు. దాంతో ఆగ్రహించిన యువకుల మూక ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడింది. ఎవ్వరు ఆపినా ఆగకుండా ఆయనపై దాడికి పాల్పడింది. ఈ ఘటనపై సింథామిల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి.. వారిపై మహిళా రక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
#WATCH| TN:Some youths assaulted a parent who’d come to pick up his daughter from Sri Meenakshi Govt Arts College for Women in Madurai on Nov 2
6 people arrested so far; case filed u/s 341,308,506(ii) &TN Prohibition of Harassment of Woman Act:Madurai CP
(Note:Abusive language) pic.twitter.com/SNspntoPYN
— ANI (@ANI) November 5, 2022