Car Hit And Kill | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. ఓ కారు ద్విచక్ర వాహనాన్ని (bike) బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి కారుపై భాగంలో ఉండిపోయాడు. అనంతరం కారు అలాగే మూడు కిలోమీరట్ల మేర వేగంగా ముందుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో కారుపై ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ (Kasturba Gandhi Marg )-టూల్స్టాయ్ మార్గ్ (Tolstoy Marg ) కూడలి వద్ద బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్ని వేగంగా వెళ్తున్న ఎస్యూవీ (SUV) కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న 20 ఏండ్ల ముకుల్ (Mukul ) అనే వ్యక్తి కింద పడిపోగా.. మరో వ్యక్తి దీపాంశు వర్మ (Dipanshu Verma) (30) కారు పైకప్పుపైకి ఎగిరి పడ్డాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించని కారు డ్రైవర్ మృతదేహంతో వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు.
ప్రమాద సమయంలో అక్కడే ఉన్న మహ్మద్ బిలాల్ (Mohammad Bilal) అనే వ్యక్తి.. తన బైక్పై కారును వెంబడించసాగాడు. హారస్ కొడుతూ.. కారు ఆపండి అంటూ గట్టిగా కేకలు వేశాడు. అయినా కారును డ్రైవర్ ఆపలేదు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాక ఇండియా గేట్ (India Gate) సమీపంలో మృతదేహాన్ని పడేసి పారిపోయారు. ఈ ఘటన ఏప్రిల్ 29 అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకోగా ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహ్మద్ బిలాల్ అనే వ్యక్తి కారును వెంబడిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ హర్నీత్ సింగ్ చావ్లాని అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో కారులో హర్నీత్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన ముకుల్కు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
PT Usha | రెజ్లర్లను పరామర్శించిన పీటీ ఉష.. సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ
Karnataka Assembly Elections | మామిడి చెట్టుపై నోట్ల కట్టలు.. స్వాధీనం చేసుకున్న అధికారులు