బండ్లగూడ : రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ( University ) అటవి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య ( Suicide ) కు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అటవి ప్రాంతంలో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం మొత్తం కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతుండడంతో పోలీసులు మృతదేహాన్ని చెట్టు నుంచి కిందకు దింపి ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వివరించారు.