స్కూల్లో గొడవలు పడుతున్నాడనే కారణంతో ఒక విద్యార్థిని ఎక్స్పెల్ చేయాలని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ భావించాడు. అయితే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆ విద్యార్థికి కోపం వచ్చింది. అంతే ఒక నాటు తుపాకీ సంపాదించి, ప్రిన్సిపాల్ను కాల్చిపారేయడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది.
ధోల్పూర్లోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఒక విద్యార్థిని ఎక్స్పెల్ చేశారు. తనను అన్యాయంగా ఎక్స్పెల్ చేశారని ఆగ్రహం తెచ్చుకున్న సదరు విద్యార్థి.. ఒక నాటు తుపాకీ సంపాదించాడు. దాన్ని తీసుకొని ప్రిన్సిపాల్ గదికి వెళ్లాడు. అక్కడే ప్రిన్సిపాల్ను కాల్చిపారేయడానికి ట్రై చేశాడు.
అయితే ఆ సమయానికి గన్ జామ్ అవడంతో ఆ ప్రిన్సిపాల్ బతికిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.