హైదరాబాద్: సిద్దిపేటలో విషాదం చోటుచేసుకున్నది. ఓ వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంతోష్ అనే విద్యార్థి సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇవాళ తరగతి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.