అమరావతి : విశాఖపట్నంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్(SPF constable) ఒకరు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య (Suicide ) చేసుకున్నాడు. ద్వారక పీఎస్ పరిధిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో గన్మెన్గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావు గురువారం ఉదయం 5 గంటలకు విధులకు హాజరయ్యాడు. వెంటనే తన వెంట ఉన్న ఎస్ఎల్ఆర్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు (Police) తెలిపారు. శంకర్రావు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.